చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా తన ఇన్స్టాగ్రామ్లో ఉన్న అన్ని సీఎస్కే పోస్టులను డిలీట్ చేశాడు. 2021తో పాటు 2022 సీజన్కు చెందిన అన్ని ఫోటోలు, వీడియోలను జడేజా డిలీట్ చేశాడు. దీంతో ఆల్ రౌండర్ జడేజాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్కే మధ్య విబేధాలు ఉన్నట్లు అర్థమవుతోంది. 2022 సీజన్లో కెప్టెన్గా చేసిన జడేజా .. సిరీస్ మధ్యలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇన్స్టా ప్రొఫైల్ నుంచి పోస్టులను డిలీట్ చేసిన అంశాన్ని సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ గుర్తించారు. ఇక ఈ ఏడాది ధోనీ బర్త్ డేకు కూడా జడేజా విషెస్ చెప్పలేదు. బహుశా 2023 సీజన్లో జడేజా .. చెన్నై జట్టును వీడే అవకాశాలు ఉన్నట్లు ఓ అభిమాని తెలిపాడు.