ముంబై: స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా వైరస్ సంక్రమించింది. పరీక్షలో ఆయన పాజిటివ్గా తేలాడు. దీంతో ఇంగ్లండ్ టూర్కు ఫ్లయిట్ ఎక్కాల్సిన అశ్విన్ ప్రస్తుతం క్వారెంటైన్లోకి వెళ్లారు. ఇంగ్లండ్తో అయిదవ టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఇండియన్ ప్లేయర్లు కొందరు సోమవారం బయలుదేరి వెళ్లారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన అశ్విన్ ఆ బృందంతో వెళ్లలేదు. ప్రోటోకాల్, క్వారెంటైన్ ముగిశాకే అశ్విన్ ఇంగ్లండ్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. జూలై ఒకటో తేదీ నుంచి ఇంగ్లండ్తో వాయిదా పడ్డ అయిదో టెస్టు ప్రారంభంకానున్నది. అయితే లీసెస్టర్షైర్తో జరిగే ప్రాక్టీసు మ్యాచ్కు అశ్విన్ దూరంకానున్నాడు. కోచ్ ద్రావిడ్తో పాటు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్లు లండన్ పయనమయ్యారు.