రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ నెల 2న హైదరాబాద్లో ప్రారంభంకానుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవం రోజునే సినిమా ప్రీలుక్ పోస్టర్ను విడుదల చేయబోతున్నారు. ‘పీరియాడిక్ చిత్రమిది. 1970 దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన స్టువర్టుపురంకు చెందిన నాగేశ్వరరావు కథ ఇది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నాం. రవితేజ పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో కథానాయికగా కృతిసనన్ సోదరి నుపూర్ సనన్ను ఎంపిక చేశారు. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్ మదీ, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, నిర్మాత: అభిషేక్ అగర్వాల్, రచన-దర్శకత్వం: వంశీ.