కొత్తూరు రూరల్ : కొత్తూరు మండల కేంద్రంలోని పాన్ డబ్బాలు, కిరాణ దుకాణాలపై ఎస్ఐ సయీద్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సయీద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుట్కా, గంజాయిని విక్రయించే వ్యక్తులను ఏ మాత్రం ఉపేక్షించేదిలేదన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా సరఫరా చేసినా, కిరాణ దుకాణాలు, పాన్డబ్బాల్లో విక్రయించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. మండలకేంద్రంలోని అన్ని కిరాణ దుకాణాలు, పాన్డబ్బాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఒక పాన్డబ్బాలో మాత్రం గుట్కా ప్యాకెట్లు దొరికినట్లు, గుట్కాను స్వాధీనం చేసుకుని విక్రయదారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సయీద్ తెలిపారు. కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ సంపత్, కానిస్టేబుల్స్ రమేశ్, రామక్రిష్ణ, సుదీర్ పాల్గొన్నారు.