కులకచర్ల, నవంబర్ 9: అటవీశాఖ భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న అర్హులైన రైతులకు ప్రభుత్వం ద్వారా హక్కుపత్రాలను అందించేందుకే గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పీరంపల్లి గ్రామంలో సర్పంచ్ రాధిక అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీశాఖ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు హక్కుపత్రాలను జారీ చేయనున్నట్లు ఆయన చెప్పా రు. అటవీశాఖ భూములను సాగు చేసుకుంటు న్న అర్హులైన రైతులు తమ భూములకు సంబం ధించిన వివరాలను గ్రామంలోనే దరఖాస్తు ఫా రంలో నింపి దానికి ఆధార్కార్డు, భూమికి సం బంధించిన ధ్రువపత్రాలను జతచేసి అధికారులకు అందజేయాలన్నారు. స్వీకరించిన దరఖాస్తులను గ్రామ కమిటీ నిర్ధారించి జిల్లా కమిటీకి పంపిస్తుందని, అనంతరం అర్హులందరికీ హక్కుపత్రాలను ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని గ్రామం లో ఉన్న అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఈవోఆర్డీ సుందర్, అటవీశాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అర్హులకు పట్టాలిస్తాం
దోమ, నవంబర్ 9: పోడు భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులను గుర్తించి పట్టా లు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కిష్టాపూర్లో తహసీల్దార్, వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామసభ నిర్వహించి పోడు భూములపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూములను సాగు చేస్తూ కాస్తులో ఉన్న వారిని గుర్తించి పట్టా పాసు పుస్తకాలను అందజేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇతరుల కు విక్రయించొద్దన్నారు. కార్యక్రమంలో మం డల ప్రత్యేకాధికారి ఏపీడీ సరళాకుమారి, సర్పం చ్ సత్యమ్మ, అటవీ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.