తుర్కయాంజాల్, అక్టోబర్22: కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనుల నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దృష్టి సారించారు. తాజా గా బాటసింగారం లాజిస్టిక్ పార్కులోకి తాత్కాలికంగా పండ్ల మార్కెట్ను తరలించగా కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రాబోయే మామి డి, బత్తాయి, పుచ్చకాయ, కర్భూజ సీజన్ల సందర్భంగా ట్రేడర్లకు ఇబ్బందులు కలగకుండా శుక్రవారం ఎమ్మె ల్యే కొహెడ పండ్ల మార్కెట్ కేటాయింపు స్థలంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మార్కెట్ ఉత్త రం వైపు నుంచి రోడ్డును విస్తరించేందుకు స్థల కేటాయింపుకోసం భూయజమానులతో చర్చించారు. ఇం దుకోసం మొండికుంట వద్ద ఉన్న భూ యజమానులు మాజీ ఎంపీ గిరీశ్ సంఘీ, ఇతర రైతులు సమావేశానికి హాజరై ఎమ్మెల్యే ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిం చి రోడ్డు విస్తరణకు స్థలం కేటాయించేందుకు అంగీకరించడంతో మార్కెట్ ఉత్తరం వైపు రోడ్డు విస్తరణకు మార్గం సుగమమైంది. మార్కెట్లో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ఎమ్మె ల్యే సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే మార్కెట్ నిర్మాణం సందర్భంగా మొదటి దశలో కనీ సం 15వందల మందికి తాగునీటి సౌకర్యం కల్పించి దశలవారీగా పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయాలని ఆయన ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించగా వా రు సమ్మతిని తెలిపారు. మార్కెట్ అవసరాల కోసం సమీపంలోని వాగుపై చెక్ డ్యాం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం కొహెడ పండ్ల మార్కెట్ లేఅవుట్లోని 36 ఎకరాల్లో తాత్కాలికంగా షెడ్ల నిర్మాణం చేపట్టి లైసెన్స్ ఏజెంట్లకు, ట్రేడర్స్కు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అప్పటి వరకు బాటసింగారం లాజిస్టిక్ పార్క్లోని ట్రే డర్స్ తరలాలని సూచించారు. ట్రేడర్స్, లైసెన్స్ ఏజెం ట్లు అధికారులకు సహకరించాలని, మార్కెట్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా అన్ని వసతులు కల్పిస్తామన్నా రు. దశలవారీగా పూర్తి స్థాయిలో కొహెడ పండ్ల మార్కెట్ను అభివృద్ధి చేస్తామన్నారు. అందమైన, ఆహ్లాదకరమైన పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఆర్.లక్ష్మణుడు, అడ్వైజర్ ఉమామహేశ్వరరావు, డీఈ రవీందర్, ఈఈ రాధాకృష్ణ, రంగారెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డి అన్నా రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి, కార్యదర్శి చిలుక నర్సింహా రెడ్డి, డైరెక్టర్లు ఆడాల రమేశ్, అనిల్ చౌదరి, క్రాంతిరెడ్డి, ఎండీ ఇబ్రహీం, ఎఫ్ఎస్సీఎస్ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, కౌన్సిలర్ జ్యోతీజంగయ్య, నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, కందాల బలదేవ రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.