కులకచర్ల, మే 19 : రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల, కులకచర్ల గ్రా మాల్లో ఏఎంసీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ఉండేందుకు ప్రభుత్వమే నేరుగా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులకు గిట్టు బాటు ధరను కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్య హరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ కులకచర్ల మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, కులకచర్ల సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ ఆనందం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్, టీఆర్ఎస్ నాయకులు రాజప్ప, మాలె కృష్ణ, నర్సిం హులు, దామోదర్రెడ్డి, అంజిలయ్య, వెంకటయ్యగౌడ్, నర్సింహులు, వెంక టయ్య, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఏపీఎం శోభ పాల్గొన్నారు.
కులకచర్ల మండల కేంద్రంలోని రైతు ఆగ్రోసేవా కేంద్రంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి విత్తనాల విక్రయకేంద్రాన్ని ప్రారంభించారు.కార్యక్రయంలో కేంద్రం నిర్వాహకులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.