వెంకటాపూర్, డిసెంబర్ 5: మండలంలోని పాలంపేట రామప్ప దేవాలయాన్ని ఆదివారం విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య, జాయింట్ సెక్రటరీలు అమస్టంగ్ చాంగ్సన్, అబ్బగాని రాము, డాక్టర్ సురభిసింగ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు సందర్శించారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య, పురావస్తుశాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేంద్రనాథ్ వారికి పుష్పాగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు హరీష్శర్మ, ఉమాశంకర్ ఫూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వాదం అందించగా డీఆర్వో రమాదేవీ శాలువాలతో సత్కరించారు. టూరిజం గైడ్ ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యతను వివరించగా ఆసక్తిగా ప్రతి అంశాన్ని, శిల్పాన్ని తిలకించారు. ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి శిల్పకళ అబ్బుర పరిచేలా ఉందన్నారు. రామప్పలో గర్భగుడిలో సహజ కాంతి ఆశ్చర్యకరంగా ఉందని, కాకతీయుల కాలం నాటి చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, జీవనశైలి, ఆర్కియాలజిస్ట్ యువతకు అందించారని అన్నారు.
కలెక్టర్తో కలిసి వారు రామప్ప సరస్సుకు చేరుకుని కొదిసేపు బోటింగ్ చేశారు. బోట్ ప్రయాణం బాగుందని, పచ్చని అడవి, కొండల మధ్య ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. వారి వెంట రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య, ప్రొటెక్ట్ ఆఫ్ ఎమిగ్రేట్ ఆఫీసర్ ముఖేష్కౌశిక్, తహసీల్దార్ మంజుల, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్యకిరణ్, జిల్లా పురావస్తు శాఖ మల్లేశం, డీఎస్పీ దేవేందర్రెడ్డి, సీఐ గుంటి శ్రీధర్, ఎస్సై రాధిక, పంచాయతీ కార్యదర్శి నిరంజన్, పోలీస్, రెవెన్యూ, టూరిజం, పురావస్తుశాఖ సిబ్బంది ఉన్నారు.