Statue of Equality | నగర శివార్లలోని ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు మూడో రోజుకు చేరుకున్నది. ఉత్సవాల్లో భాగంగా నేడు యాగశాలలో లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. ఈ మహాయాగం ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. అదేవిధంగా లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించనున్నారు. చినజీయర్ స్వామితోపాటు ఏడుగురు జీయర్ స్వాముల సమక్షంలో పూజలు నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం.. యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణేష్టి, సత్సంతానానికై వైనేతేయేష్టి, శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజలు జరుగనున్నాయి. కార్యక్రమంలో ప్రధానఘట్టం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్నది. రేపు సాయంత్రం ముచ్చింతల్ చేరుకోనున్న ప్రధాని మోదీ.. 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహం జాతికి అంకితం ఇవ్వనున్నారు.
నేటి కార్యక్రమాలు..
– ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీ లక్ష్మీనారాయణ పూజ
– 10:30 నుంచి 10:50లకు యాగశాలల్లో శ్రీ చిన జీయర్ స్వామి పర్యటన
– 10:50 నుంచి 11:10 వరకు అథర్వ వేదపండితుల ఆశీర్వచనాలు
– 11:10నుంచి 11:30 వరకు ప్రజ్ఞ, మనోజ్ఞ, సప్తస్వర సంగీత అకాడమీ వారి సంగీత గానం
– 11:30 నుంచి 12:00 వరకు అతిథులకు సన్మానం
– 12:00 నుంచి 12:30 వరకు శ్రీమతి పేరిందేవి-శ్రీకృష్ణన్మత్వ అకాడమీ-బృంద నృత్య ప్రదర్శనలు
– 12:30 నుంచి 1:00 వరకు సుష్మ, సుస్మిత బృంద గానం
– 2:00 నుంచి 2:30 వరకు పెద్దబ్రోలు భావన బృందం నృత్య ప్రదర్శనలు
– 2:30 నుంచి 2:50 వరకు యజుర్వేద పండితుల పుణ్యవచనాలు
– 2:50 నుంచి 3:10 వరకు నల్లగొండకు చెందిన మానస భజన బృంద ఆలాపనలు
– 3:10 నుంచి 3:30 వరకు రఘునాథ భట్టర్ ప్రవచనాలు
– 3:30 నుంచి 3:50 వరకు పెద్దబ్రోలు భావన బృందం నృత్య ప్రదర్శనలు
– 3:50 నుంచి 4:10 వరకు వేద పండితుల ప్రవచన పఠనాలు
– 4:10 నుంచి 5:00 వరకు వెంకన్న స్వామి భజన
– 5:00 నుంచి 5:30 వరకు విష్ణు సహస్ర నామ పారాయణం
– 5:30 నుంచి 5:45 వరకు దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రచవనాలు
– 5:45 నుంచి 6:00 వరకు వేద పఠనం, ప్రవచనం
– 6:00 నుంచి 7:00 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు
– 7:00 నుంచి 7:30 వరకు అతిథులకు సన్మానాలు, ఆశీర్వచనాలు
– 7:30 నుంచి 8:00 వరకు మ్యాపింగ్ వీడియో ప్రదర్శనలు
– 8 నుంచి 10 వరకు శ్రీమన్నారాయణుడి భజనలు