కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో రామకోటి స్తూప నిర్మాణ పనులు శరవేగం గా సాగుతున్నాయి. గత మార్చి 9న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్తూప నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ రూ.50 లక్షలు మంజూరు చేసింది. రెండు నెలల్లో పూర్తిస్థాయి హంగులతో పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధం కానున్నది. – మల్యాల