Ram Sahay Prasad Yadav : నేపాల్ మూడో వైస్ ప్రెసిడెంట్గా రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్ (Ram Sahay Prasad Yadav) ఎన్నికయ్యారు. జనతా సమాజ్బాదీ పార్టీ (Janata Samajbadi Party)కి చెందిన రామ్ సహయ్ సీపీఎన్ – యూఎంఎల్ (CPN-UML) పార్టీ అభ్యర్థి అష్ట లక్ష్మి శక్యాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
మొత్తం పోలైన 52,628 ఓట్లలో రామ్ సహాయ్కు 30,328 ఓట్లు వచ్చాయి. లక్ష్మిశక్యాకు 16,328 ఓట్లు పడ్డాయి. జనమత్ పార్టీకి చెందిన మమతా ఝా 2,537 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఉపాధ్యక్షుడి ఎన్నిక నుంచి తప్పుకున్న ప్రమీలా యాదవ్(జనతా సమాజ్వాదీ పార్టీ)కు 48 ఓట్లు వచ్చాయని ఖాట్మండ్ పోస్ట్ అనే వార్తాపత్రిక తెలిపింది.
నేపాల్ 2008లో గణతంత్ర దేశంగా ఆవిర్భించిన తర్వాత జరిగిన మూడో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఇది. పరమానంద ఝా ఆ దేశ తొలి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఎంత మంది ఎంపీలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు? వాళ్ల ఓటు విలువ ఎంత? అనే విషయానికొస్తే.. ఫెడెరల్ పార్లమెంట్ సభ్యులు 333మంది, అసెంబ్లీ సభ్యులు 550 మంది ఈ ఎన్నికలో పాల్గొన్నారు. ప్రతి ఎంపీ ఓటు విలువ 79. అదే అసెంబ్లీ సభ్యుడి ఓటు విలువ 48.