ఖైరతాబాద్, నవంబర్ 14: బీసీ జనగణనపై కేంద్ర ప్రభుత్వ దమననీతిని నిలదీయాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ పిలుపునిచ్చారు. బీసీ జనగణన లెక్కలు తేల్చలేమంటూ కోర్టులో అఫిడవిట్ను దాఖలు చేయడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, జంబుద్వీప జన సమితి ఆధ్వర్యంలో ‘దేశవ్యాప్తంగా బీసీ కులాల జనగణన’ అనే అంశంపై ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల పోరాటాలతో 2011లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనగణన ప్రారంభించిందని, 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఆ అంశాన్ని పక్కనపెట్టిందని విమర్శించారు. బీసీ జనగణన, రిజర్వేషన్ల కోసం కేంద్రంతో చేసే పోరాటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. సమావేశంలో సినీనటుడు సుమన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్గౌడ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, టీఆర్ఎస్ నేత రాజారాంయాదవ్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు రామకృష్ణయ్య, నాయకులు డాక్టర్ వినయ్కుమార్, బత్తుల సిద్దేశ్వర్, రియాజ్, డాక్టర్ చీమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): కరెన్సీపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 14 వరకు జ్ఞానయుద్ధ యాత్రను చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ తెలిపారు. ఆదివారం హిమాయత్నగర్లో యాత్ర వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్బీఐ సృష్టికర్త అంబేద్కర్ అని, కరెన్సీ నోట్లపై ఆయన ఫొటో ముద్రించకపోవడం చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు. ఈ అంశంపై రాష్ట్రపతిని కలుస్తామని ప్రకాశ్ చెప్పారు. కార్యక్రమంలో సమితి జాతీయ అధ్యక్షుడు పరశురామ్, ఉపాధ్యక్షుడు స్వామి, బానోత్ రవి, కృష్ణ పాల్గొన్నారు.