న్యూఢిల్లీ: నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్లో ఉభయసభలు వాయిదాపడ్డాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 16 రోజులు. అయితే ఇవాళ సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రెండు సభలను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలో 16 రోజులు సిట్టింగ్స్ జరిగాయని, ఆ సమయంలో 38 గంటల పాటు కార్యక్రమాలు నిర్వహించినట్లు చైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. కానీ విపక్షాల ఆందోళన వల్ల 48 గంటల సభా సమయం వృధా అయినట్లు వెంకయ్య చెప్పారు. ఈ సారి కేవలం 5 ప్రభుత్వ బిల్లులు మాత్రమే సభ ఆమోదం పొందినట్లు ఆయన వెల్లడించారు. 27 ప్రైవేటు మెంబర్స్ బిల్లులను ప్రవేశపెట్టినా.. కేవలం ఆరోగ్య హక్కు బిల్లు గురించి మాత్రమే స్వల్ప చర్చ జరిగినట్లు వెంకయ్య తెలిపారు. రాజ్యసభ చైర్మెన్గా తన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో సభ్యులందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు.
లోక్సభ సమావేశాలను కూడా నాలుగు రోజులు ముందుగానే వాయిదా వేశారు. 44 గంటల 29 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు జరిగినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను నింపినట్లు స్పీకర్ వెల్లడించారు. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషణ్ సెంటర్ బిల్లును లోక్సభలో మూజువాణి ఓటుతో పాస్ చేశారు.