న్యూఢిల్లీ : వచ్చే ఐదేళ్ల కాలంలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.499 కోట్ల బడ్జెట్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించారు. రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంతో దాదాపు 300 స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. సైనిక హార్డ్వేర్, ఆయుధాల దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని రక్షణ తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ ప్రయత్నంతో ఈ పథకం సమకాలీకరిస్తోందని పేర్కొంది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) -డెఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డీఓఓ) కు వచ్చే ఐదేళ్లకు రూ.498.8 కోట్ల బడ్జెట్ మద్దతును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రక్షణ, ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన.. స్వదేశీకరణ ప్రాథమిక లక్ష్యం ఐడెక్స్-డీఓఓకు ఉందని తెలిపింది. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిని పెంపొందించడానికి పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా రక్షణ ఉత్పత్తి విభాగం (డీడీపీ) ఐడెక్స్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు, డీఓఓను ఏర్పాటు చేయడం మంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే ఐదేళ్లకు రూ.498.8 కోట్ల బడ్జెట్ సహకారంతో ఈ పథకం, డీఓఓ ఫ్రేమ్వర్క్ కింద దాదాపు 300 మంది స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, వ్యక్తిగత ఆవిష్కర్తలు.. 20 భాగస్వామి ఇంక్యుబేటర్లకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.