జైపూర్: జైపూర్ మున్సిపాల్టీ మేయర్, బీజేపీ కౌన్సిలర్ సౌమ్యా గుర్జార్పై రాజస్థాన్ ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ నగర మాజీ కమీషనర్ యగ్యా మిత్రా సింగ్ డియోపై దాడి చేసిన ఘటనలో సౌమ్యా గుర్జార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సౌమ్య మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మేయర్ సౌమ్యాతో పాటు బీజేపీ కౌన్సిలర్లు పారస్ జైన్, అజయ్ సింగ్లపై కూడా ప్రభుత్వం వేటు వేసింది. మరో స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ శర్మను కూడా టర్మినేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.