వరంగల్ చౌరస్తా/ పోచమ్మమైదాన్/ నెక్కొండ/ రాయపర్తి/ చెన్నారావుపేట/ పర్వతగిరి/ ఖానాపూర్/ నర్సంపేట రూరల్/ దుగ్గొండి/ నల్లబెల్లి/ గీసుగొండ/ సంగెం, నవంబర్ 23: సైబర్ క్రైమ్స్పై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఏసీపీ గిరికుమార్ సూచించారు. సైబర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరంగల్ మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో మట్టెవాడ ప్రభుత్వ పాఠశాల, మిల్స్కాలనీ పోలీసుల ఆధ్వర్యంలో శివనగర్ ప్రభత్వ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏసీపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సెల్ఫోన్కు వచ్చే మెసేజ్లకు ప్రతిస్పందించొద్దని తెలిపారు. మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాజేశ్వరి, శ్రీచరణ్ను సైబర్ అంబాసిడర్స్గా ఎంపిక చేసి బ్యాడ్జీలను అందజేశారు. మట్టెవాడ హెచ్ఎం పూసారాం, సైబర్ మెంటర్ కిరణ్కుమార్, మట్టెవాడ సీఐ గణేశ్ పాల్గొన్నారు. వరంగల్ దేశాయిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంతెజార్గంజ్ ఎస్సై స్వామి సైబర్ నేరాలపై సూచనలు చేశారు. నెక్కొండ, రెడ్లవాడ జడ్పీఎస్ఎస్ల్లో సైబర్ నేరాలపై విద్యార్థులకు ఏఎస్సై వేణుగోపాల్, ఎంఈవో రత్నమాల అవగాహన కల్పించారు.
రాయపర్తి మండలం కొండూరు, కొత్తూరులో ఉన్నత, మండల పరిషత్ పాఠశాలలో ఏఎస్సై సదయ్య, తూళ్ల సంపత్కుమార్ సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చెన్నారావుపేట జడ్పీఎస్ఎస్, కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులకు చైల్డ్లైన్, గంజాయి, సైబర్క్రైం, మూఢ నమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై శీలం రవి పలు సూచనలు చేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పోలెపల్లి రవి, ప్రత్యేక అధికారి జ్యోతి, మెంటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పర్వతగిరి కేజీబీవీలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. సైబర్ కాంగ్రెస్ నోడల్ ఆఫీసర్ రమాదేవి మాట్లాడారు. పాఠశాల ప్రత్యేక అధికారి మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఖానాపూర్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, పోలీస్శాఖ, షీ టీమ్స్, యంగిస్థాన్ ఫౌండేషన్ సంయుక్తంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు సైబర్నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. హెచ్ఎం దూళం రాజేందర్, అశోక్నగర్ కేజీబీవీ ఎస్ఓ మేనక మాట్లాడారు. ఉపాధ్యాయులు వేణుగోపాల్, రవీందర్, నవీన్కుమార్, చంద్రమౌళి, జితేందర్, సరిత, నాయుడు, రామ్మోహన్రావు, నిరోషా పాల్గొన్నారు. చెన్నారావుపేట సైబర్ క్రైమ్ ఇన్చార్జ్ క్రాంతికుమార్, గురిజాల హైస్కూల్ హెచ్ఎం గుడిపూడి రాంచందర్రావు సదస్సులో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ గొడిశాల మమత, ఎస్ఎంసీ చైర్మన్ మడిపెద్ది రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దుగ్గొండి ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో మల్లంపల్లి కేజీబీవీలో ప్రత్యేకాధికారి మంజుల సైబర్ కాంగ్రెస్ నిర్వహించారు.
దుగ్గొండి పీఎస్ హెడ్ కానిస్టేబుల్, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. నల్లబెల్లి కేజీబీవీలో నిర్వహించిన సైబర్ కాంగ్రెస్లో ఎస్సై బండారు వెంకటేశ్వర్లు మాట్లాడారు. సోషల్ మీడియాకు అలవాటు పడొద్దని చెప్పారు. పాఠశాల ప్రత్యేకాధికారి సునీత పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ మోసాలను విద్యార్థులకు వివరించారు. ఎస్సై విద్యాసాగర్, హెచ్ఎం రమేశ్ పాల్గొన్నారు. సంగెం కేజీబీవీలో సైబర్, భద్రతపై విద్యార్థులకు ఎంఈఓ ఎన్.విజయ్కుమార్ అవగాహన కల్పించారు. పాఠశాల ప్రత్యేకాధికారి నీలిమ, మహిళా కానిస్టేబుల్ శ్రీలత పాల్గొన్నారు.