హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడుతాయని వెల్లడించింది. ఆ తర్వాత ఒకట్రెండు రోజులు పొడి వాతావరణం ఏర్పడి, తిరిగి వానలు కురిసే వీలున్నదని పేర్కొన్నది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1న మరో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది.