DC vs UPW : యూపీ వారియర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శ్వేతా షెరావత్(19) రాధా యాదవ్ బౌలింగ్లో ఔటయ్యింది. కవర్స్లో గాల్లోకి లేచిన బంతిని జొనాసెన్ అందుకుంది. దాంతో, 30 రన్స్ వద్ద యూపీ తొలి వికెట్ పడింది. అలిసా హీలీ(15), సిమ్రాన్ షేక్ (1) క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లకు యూపీ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. శిఖా పాండే వేసిన రెండో ఓవర్లో శ్వేత మూడు బౌండరీలు కొట్టింది. ఈ లీగ్లో వరుసగా విఫలమైన ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసింది.