మాదాపూర్, డిసెంబర్ 6: రాధా స్మెల్టర్స్…తన కొత్త ఉత్పత్తి రాధా టీఎంటీ 550డి ఎల్ఆర్ఎఫ్ స్టీల్ బార్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ హోం శాఖా మంత్రి మహమూద్ ఆలీ ఈ బార్స్ను లాంఛనంగా విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో ఇప్పటి వరకు 30 నుండి 40 అంతస్తుల భవనాలు లేవని, అటువంటి భహుళ అంతస్తుల నిర్మాణానికి అవసరమైన దృడమైన స్టీల్ను రాధా స్మెల్టర్స్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రాధా స్మెల్టర్స్ ఎండీ సుమన్ సరాఫ్ మాట్లాడుతూ తమ కంపెనీ రూ. 530 కోట్ల టర్నోవర్ను అధిగమించిందని, రానున్న సంవత్సరంలో రూ. వేయి కోట్ల టర్నోవర్ను అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని 550 డి రేంజ్ కలిగిన స్టీల్ను ఉత్పత్తి చేసేందుకు రూ. 75 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. 2025 సంవత్సరానికల్లా తమ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.