న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఢిల్లీలోని కుతుబ్మినార్ ఒకప్పుడు విష్ణు స్తంభం అని, దాన్ని హిందూ రాజు కాలంలో విష్ణు ఆలయంపై నిర్మించారని వీహెచ్పీ నేత వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. ఈ స్తంభంలోని కొన్ని భాగాలను ఓ ముస్లిం పాలకుడు పునర్నిర్మించి కువ్వత్-ఉల్-ఇస్లాంగా పేరు మార్చారని అన్నారు. టవర్ కింది మూడు ఫ్లోర్లు, మిగతా ఫోర్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం చూడొచ్చని అన్నారు. కుతుబ్మినార్ కాంప్లెక్స్ వద్ద ఉన్న పురాతన ఆలయాలను పునర్నిర్మించాలని, అక్కడ హిందూ ఆచారాలు, ప్రార్థనలు తిరిగి ప్రారంభించాలని వీహెచ్పీ శనివారం డిమాండ్ చేసింది.