తిరుమల : సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో, గోవిందా యాప్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వాస్తవానికి కోటా ఈ నెల 20న విడుదల కావాల్సిన ఉండగా.. టికెట్ల విడుదల వాయిదా వేసింది. ఇవాళ టీటీడీ ఆన్లైన్ 8వేల టికెట్లను అందుబాటులో ఉంచనుంది. భక్తులు కొవిడ్ నియమాలను పాటించి స్వామివారిని దర్శించుకోవాలని కోరింది.