అబిడ్స్, నవంబర్ 11 : నగరంలోని పలు ప్రాంతాలలో నూతన మ్యాన్హోళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపగా వాటి ఆర్సీసీ కవర్లు, ఫ్రేమ్లు చుడీబజార్లోని జీహెచ్ఎంసీ స్టోర్స్కు చేరుకున్నాయి. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ ఎస్ఈ సహదేవ్ రత్నాకర్, జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ ఈఈ ప్రకాశం స్టోర్స్ను సందర్శించి ఆర్సీసీ కవర్లు, ఫ్రేమ్ల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ మాట్లాడుతూ మొదటి విడతగా సీసీ కవర్లు, ఫ్రేమ్లు స్టోర్కు చేరుకున్నాయని తెలిపారు.