మహాత్మా జ్యోతిబా ఫూలే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తునారు. గత విద్యావిధానాన్ని ప్రక్షాళన చేస్తూ ప్రస్తుత సమాజ పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు . ‘మన టీవీ’, ‘టీ- సాట్’ అనే ఛానళ్ళ ద్వారా సాంకేతికతను ఉపయోగించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నది.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 66.5 శాతం కాగా, నేడు 73.8 శాతానికి పెరిగింది. అంటే సుమారు 7.3 శాతం అక్షరాస్యత పెరిగింది. రాష్ట్ర జీడీపీలో 2 శాతానికి పైగా విద్యావ్యవస్థపై ఖర్చు పెట్టడం గొప్ప విషయం. దేశస్థాయిలో 1శాతం పైన మాత్రమే ఖర్చుపెడుతుండటం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం 3-6 ఏండ్ల వయసు చిన్నారి విద్యార్థులకు 35,700 అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రీ ప్రైమరీ (నర్సరీ, ఎల్కేజీ ,యూకేజీ) విద్యను అందిస్తున్నది. ఈ కేంద్రాల్లో 4,60,000 మంది విద్య అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 40,900 పాఠశాలలు ఉండగా అందులో 63.4శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి. మొత్తం స్కూళ్లలో 26,100 పభుత్వానివి కాగా, 27.5శాతం మాత్రమే అంటే 10,505 పాఠశాలలు ప్రైవేటువి. మరో 1.64 శాతం ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఒక శాతం లోపు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోనివి. ప్రభుత్వ పాఠశాలలు మారుమూల గిరిజన, ఆదివాసీ, కొండ కోన ప్రాంతాలతో పాటుగా ప్రతిగ్రామంలో ఉన్నాయి.
ప్రైవేటు పాఠశాలలు మండల కేంద్రాలు, పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రమే నడుస్తున్నాయి. మొత్తం 60,07,400 మంది పాఠశాల విద్యార్థుల్లో 19 లక్షల 85వేలమంది ఆంటే 33 శాతం విదార్థులు స్థానిక సంస్థలలో ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో 38,100 మంది, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లలో 6 లక్షల 56వేల మంది అంటే 11 శాతం విద్యార్థులు చదువుకొంటున్నారు. ఎయిడెడ్ స్కూల్స్ లో 93,500 మందివిద్యార్థులు అంటే 16 శాతం ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 32,25,000 మంది అంటే 54శాతం విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల సామాజిక కోణం చూస్తే బీసీలు 49శాతం, ఇతరులు 23.2శాతం, ఎస్సీలు 16.9శాతం, ఎస్టీలు 10.9 శాతం మంది ప్రభుత్వపాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు.
రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య విషయంలోనూ గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ప్రాథమిక విద్య మొదలు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు వృత్తి విద్యాకోర్సులను పెద్దఎత్తున అభివృద్ధిపరుస్తున్నారు.
రాష్ట్రంలో 10వ తరగతి లోపు చదువు మధ్యలో ఆపేసిన వారి లో 14 శాతం బాలురు కాగా, 10.7 శాతం బాలికలు ఉన్నారు. ఇదే దేశస్థాయిలో చూస్తే.. 17.2 శాతం బాలురు, 16.9 శాతం బాలికలు మధ్యలో చదువు మానేయడం గమనార్హం. రాష్ట్రంలో 2014 నుంచి 2021వరకు రెసిడెన్షియల్ హాస్టళ్లు గణనీయంగా పెరిగాయి. 2014లో 298 ఉంటే నేడు 923కు పెరగడం విద్యావ్యవస్థలో ఒక పెద్దమార్పుగా చెప్పవచ్చు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్స్ 134 నుంచి 268కు పెరిగాయి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ 2014లో 96ఉంటే నేడు 133 అయ్యాయి. మైనారిటీ హస్టల్స్ 12 నుంచి 204కు పెరిగాయి. వీటిలో 91,700 మంది విద్యార్థులున్నారు. బీసీ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ హాస్టళ్లు 19 నుంచి 281కు పెరిగాయి. వీటిలో 1లక్ష 15 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విధమైన విద్యావిప్లవం ద్వారా తెలంగాణ సమా జంలో రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయ నటంలో సందేహం లేదు.
రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య విషయంలోనూ గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ప్రాథమిక విద్య మొదలు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు వృత్తి విద్యాకోర్సులను పెద్దఎత్తున అభివృద్ధిపరుస్తున్నారు. ఈ క్రమంలోనే మన విద్యార్థులు తమ ప్రతిభను, విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతున్నారంటే దానికి సీఎం కేసీఆర్ దూర దృష్టి కారణం.
(వ్యాసకర్త: అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ పాలనాశాస్త్రం, కేయూ)
డాక్టర్ పెదమళ్ల
శ్రీనివాసరావు
98660 67910