పారిస్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో నిరాశ ఎదురైంది. వరుస విజయాలతో సెమీస్కు చేరిన తెలుగమ్మాయి శనివారం జరిగిన కీలక పోరులో 21-18, 16-21, 12-21తో ప్రపంచ 15వ ర్యాంకర్ సయాక తకహాషి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. గత వారం డెన్మార్క్ ఓపెన్లో క్వార్టర్స్లో ఓడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు.. ఈ సారి సెమీస్లో ఇంటి దారి పట్టింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్లో భారత్ పోరాటం ముగిసింది.