న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ దశలో అణ్వాయుధాలు(Nuclear Weapons) వినియోగించనున్నట్లు బెదిరించారు. అయితే ఆ బెదిరింపులు జోక్ కాదు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. క్యూబా మిస్సైల్ సంక్షోభం తర్వాత ఎదురైన అత్యంత సంక్లిష్ట పరిస్థితి ఇది అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ ఆక్రమణ అంశంలో అణ్వాయుధాలు కానీ, జీవాయుధాలు కానీ, రసాయన ఆయుధాల వినియోగం విషయంలో పుతిన్ జోక్ చేయడం లేదని బైడెన్ తెలిపారు.
మన్హటన్లో పార్టీ నేతలతో జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా తొలిసారి ఆర్మెగెడాన్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. 1962లో క్యూబా మిస్సైల్ సంక్షోభాన్ని అమెరికా ఎదుర్కొన్నది. అమెరికా లక్ష్యంగా రష్యా తన మిస్సైల్ను క్యూబాలో ఉంచింది. ఆ సమయంలో చాలా క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు మళ్లీ నేరుగా అణ్వాయుధాల బెదిరింపు వచ్చినట్లు బైడెన్ తెలిపారు.
ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే, సమస్య మరింత జఠిలంగా మారనున్నట్లు బైడెన్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నడీ, సోవియేట్ నేత నికితా కురుచ్చేవ్లు ఓ దశలో అణ్వాయుధ దాడికి ఉసిగొల్పుకున్నారు. 1962లో ఎదురైన ఆ పరిస్థితి ఇప్పుడు మళ్లీ వస్తున్నట్లు బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.