బీజింగ్, సెప్టెంబర్ 23: రోజుకు నాలుగు కప్పుల చొప్పున దాదాపు పదేండ్లపాటు గ్రీన్, బ్లాక్ టీ తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు 17 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ టీలను పాలతో కలిపి తీసుకున్నా ఇదే ఫలితం వస్తుందని కనుగొన్నారు. ఈ మేరకు తాజా అధ్యయనంలో వెల్లడించారు. 8 దేశాలకు చెందిన 10 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించి, ఈ విషయాన్ని తేల్చారు.
పాలీఫినాల్స్ అనే సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తున్నట్టు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలను ‘యురోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్’ వార్షిక సమావేశంలో సమర్పించారు.