ఐపీఎల్ 2021 సందడి మొదలైంది. రాబోయే సీజన్ కోసం ఫ్రాంఛైజీలన్నీ కొత్త జెర్సీలను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ నూతన జెర్సీలను రిలీజ్ చేయగా తాజాగా పంజాబ్ కింగ్స్ సరికొత్త డిజైన్తో రూపొందించిన జెర్సీని మంగళవారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా గోల్డెన్ స్ట్రిప్లతో రెడ్ జెర్సీని తయారు చేశారు. కేకేఆర్, ఆర్సీబీ తర్వాత గోల్డెన్ కలర్ హెల్మెట్లను వినియోగించనున్న మూడో జట్టు పంజాబే. ఈ ఏడాది పేరు మార్చుకున్న పంజాబ్(గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) అన్ని విభాగాల్లోనూ సమూల మార్పులతో రాబోయే సీజన్కు సన్నద్ధమవుతోంది. ముంబై వేదికగా ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో పంజాబ్ తలపడనుంది.
𝐓𝐡𝐞 𝐰𝐚𝐢𝐭 𝐢𝐬 𝐨𝐯𝐞𝐫! ⌛
— Punjab Kings (@PunjabKingsIPL) March 30, 2021
Reveal kar rahe hain assi, saddi new jersey 👕😍#SaddaPunjab #PunjabKings #IPL2021 pic.twitter.com/zLBoD0d5At