PBKS vs RCB : ఐపీఎల్ పదిహేడో సీజన్ 58వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(PBKS), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) ఢీ కొంటున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. ధర్మశాలలో జరుగుతున్న ఈ పోరులో పంజాబ్ సారథి సామ్ కరన్ టాస్ గెలిచి ఆర్సీబీకి బ్యాటింగ్ అప్పగించాడు. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలంటే గెలవక తప్పని మ్యాచ్ కావడంతో ఇరుజట్లు విజయంపై కన్నేశాయి.
బెంగళూరు తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, మహిపాల్ లొమ్రోర్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, సిరాజ్, ఫెర్గూసన్.
పంజాబ్ తుది జట్టు : జానీ బెయిర్స్టో(వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, రిలే రస్సో, శశాంక్ సింగ్, సామ్ కరన్(కెప్టెన్), లివింగ్స్టోన్, అషుతోశ్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్, విద్వత్ కవెరప్ప.
ధర్మశాలలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పంజాబ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా విజృంభణతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. దాంతో, ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకున్న పంజాబ్ ఈసారి పంజా విసురుతుందా? లేదా? మరికొన్ని నిమిషాల్లో తెలియనుంది.