న్యూఢిల్లీ: పేలవ ఫామ్తో భారత జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా కౌంటీల బాటపట్టాడు. ఈ సీజన్లో పుజారా ససెక్స్ తరఫున బరిలోకి దిగనున్నట్లు ఆ క్లబ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసీస్ మిడిలార్డర్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ స్థానాన్ని పుజారా భర్తీ చేయనున్నట్లు అందులో పేర్కొంది. టీమ్ఇండియా తరఫున 95 టెస్టులాడిన పుజారా దశాబ్ద కాలంగా మూడో స్థానంలో నిలకడగా ఆడుతూ వస్తున్నాడు. అయితే ఇటీవల ఈ సీనియర్ బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో.. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు పుజారా కౌంటీలాడేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో పుజారా యార్క్షైర్, నాటింగ్హామ్షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.