లండన్: ఇండియా, లీసెష్టర్షైర్ మధ్య ఇవాళ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. అయితే ఇంగ్లండ్తో జరగనున్న చివరి టెస్టు మ్యాచ్కు ముందు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భారత ఆటగాళ్లకు అందరికీ ప్రాక్టీస్ అయ్యే విధంగా కొందరు ప్లేయర్లను లీసెష్టర్షైర్ జట్టు తరపున ఆడిస్తున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పుజారా, బౌలర్ బుమ్రా, బ్యాటర్ పంత్, బౌలర్ ప్రసిద్ధి కృష్ణలు లీసెష్టర్షైర్ తరపున ఆడడం గమనార్హం.