వోర్సెస్టర్: పేలవ ఫామ్తో భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా.. కౌంటీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ససెక్స్ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే అజేయ ద్విశతకం (201 నాటౌట్)తో చెలరేగిన పుజారా.. తాజా మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. వర్సెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పుజారా (206 బంతుల్లో 109; 16 ఫోర్లు) శతకంతో కట్టుకున్నాడు. ఇతర ఆటగాళ్లు విఫలమైన చోట పుజారా తన క్లాస్ కనబరిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చతేశ్వర్కు ఇది 52వ శతకం కావడం విశేషం. అయితే.. పుజారా రాణించినా తక్కిన ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ససెక్స్ జట్టు ఫాలోఆన్లో పడింది.