హన్వాడ, ఏప్రిల్ 18: ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందిస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ పాత కలెక్టర్ భవనం కూల్చి రూ.3 కోట్లతో నూతన దవాఖాన నిర్మిస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ దవాఖానలో కాన్పులు చేసుకొంటే కేసీఆర్ కిట్తోపాటు రూ.12 వేలు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, ప్రైవేట్కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. మెగా హెల్త్ క్యాంప్లో 4వేల మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించామన్నారు. 150 మంది రక్తదానం చేసినట్టు వెల్లడించారు. మూడు నెలలకోసారి శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.