ఛండీగఢ్ : ఇకపై ఆందోళనల్లో ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా ఆ నష్టాన్ని ఆందోళనాకారులే భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి నష్టం రికవరీ బిల్లు -2021కు గవర్నర్ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో చట్టం రూపం దాల్చింది. ఈ చట్టానికి ఆమోదముద్ర రావడంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో హింసాత్మక ఉద్యమానికి నాయకత్వం వహించే వారు, ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి కూడా పాల్పడుతున్నారు. ఈ నష్టం కొన్ని సందర్భల్లో ఎక్కువగా ఉండటంతో ఆస్తి హక్కుదారులు చాలా నష్టపోవాల్సి వస్తున్నది. దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు హర్యానా ప్రభుత్వం ఆస్తి నష్టం రికవరీ బిల్లును తీసుకొచ్చింది. ఆందోలన సమయంలో ఏదైనా నష్టం జరిగినపక్షంలో ఆ మొత్తాన్ని ఇక నుంచి వారి నుంచే భర్తీ చేసేందుకు ఈ చట్టం ద్వారా వీలు చిక్కుతుంది.
ఇందు కోసం ప్రభుత్వం త్వరలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయనున్నది. ట్రిబ్యునల్ బాధితుడికి గరిష్టంగా రూ .10 కోట్ల వరకు పరిహారం చెల్లించవచ్చు. అయినప్పటికీ నష్టానికి బీమా సంస్థల నుంచి ఏదైనా పరిహారం అందితే.. దాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. ఆందోళనల్లో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తి అయిన వాహనాలు, జంతువులు, ఆభరణాలు వంటివి వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ ఉంటే బాధితులు పరిహారం కోసం అడగవచ్చు.
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
ఆఫ్ఘనిస్తాన్లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..