హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): టీచర్ల పదోన్నతులు, బదిలీలు వేసవిలో ఉంటాయని ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి దేశానికే ఆదర్శమని కొనియాడారు. మంగళవారం హైదరాబాద్ నారాయణగూడలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ ముగిసిన వెంటనే పదోన్నతుల షెడ్యూల్ ఉంటుందని తెలిపారు.
13 జిల్లాల్లో మిగిలిపోయిన స్పౌజ్ కేటాయింపులు త్వరగా చేపట్టాలని, పదోన్నతులతో ఏర్పడిన ఖాళీల్లో సీనియారిటీ ఆధారంగా జూనియర్ ఉపాధ్యాయులకు కోరుకున్న జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమాలకర్రావు, గుర్రం చెన్నకేశవరెడ్డి, రెహమాన్ పాల్గొన్నారు.