నల్లగొండ : అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దేవరకొండ ఎమ్మె్ల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలంలోని మడమడక గ్రామంలో రూ.10లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు, దుబ్బా తండా గ్రామంలో రూ.5లక్షలు, అమాటోనిగూడెం గ్రామంలో రూ.10లక్షలు, మైనంపల్లి గ్రామంలో రూ.10లక్షలు, మర్రిచెట్టు తండాలో రూ.5 లక్షల చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణ, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.