న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. 12 రాష్ర్టాల్లో మే 7న పోలింగ్ జరిగే 97 స్థానాలకు గాను ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లు దాఖలుకు ఈ నెల 19 ఆఖరు తేదీ. ఇటీవల వాయిదాపడ్డ మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గ ఎన్నిక కోసం ఈసీ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీ, పశ్చిమ బెంగాల్, జమ్ము కశ్మీర్ రాష్ర్టాల్లో మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.