భువనగిరి కలెక్టరేట్, మార్చి 21 : ప్రజావాణి సమస్యలపై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్తివారీ, శ్రీనివాస్రెడ్డి, నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ పారిశుధ్య మహిళా కార్మికులకు హైజినిక్ కిట్లను కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య మహిళా కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్చైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ పూర్ణచందర్, రెడ్క్రాస్ చైర్మన్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, సభ్యులు కొడారి వెంకటేశ్, దేవనక్ అంజయ్య, ఎస్ఎన్.చారి, చేపూరి అనిల్, జంపాల అంజయ్య, ఎం.రాజిరెడ్డి, దాసరి శ్రీనివాస్, మాటూరి బాలేశ్వర్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ : ప్రతిరోజూ యోగా చేయడంతో అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండల కేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాలలో మేధా యోగా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు యోగా చేయడంతో ఒత్తిడిని జయించి విజయాలు సాధించవచ్చని తెలిపారు. అనంతరం కలెక్టర్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బందిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ రమేశ్, కవితారావు, వెంకటేశ్వర్లు, చింతల సాయి, శ్రీకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో చదువుతో పాటు వారిలోని సృజనాత్మకతను వెలికితీయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ప్రముఖ రచయిత్రి, బాలల హక్కుల సంఘం జిల్లా చైర్పర్సన్ బండారు జయశ్రీ సంపాదకత్వంలో వెలువడిన లేత చిగురులు కవితా సంపుటిని కలెక్టరేట్లో సోమవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయులు బోధనతో పాటు భాషా సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా యాదాద్రికి చెందిన కవి, రచయిత శ్రీపాద శివకుమార్ రచించిన యాదాద్రి వైభవం యూట్యూబ్ సీడీని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీ ఫౌండేషన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వర్రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారి కృష్ణవేణి, బాలల హక్కుల పరిరక్షణ అధికారి సైదులు, కవులు, కవయిత్రులు మర్రి జయశ్రీ, వల్లల విజ య, సురేందర్రావు, లక్ష్మి, సరిత పాల్గొన్నారు.