ముంబై: బాలీవుడ్ బేబీ ప్రియాంకా చోప్రా తన టీనేజీ ఫోటోలను ఇప్పుడు ఇన్స్టాలో పోస్టు చేస్తోంది. 18 ఏళ్ల వయసులో మాల్దీవుల్లో దిగిన ఓ బీచ్ ఫోటోను ప్రియాంకా తాజాగా పోస్టు చేసింది. 2000 సంవత్సరంలో ఆ ఫోటో దిగింది. ఆ ఏడాదే ప్రియాంకా చోప్రాకు మిస్ వరల్డ్ బ్యూటీ కిరిటీం దక్కింది. మాల్దీవుల బీచ్లో ఫోజు ఇచ్చిన ప్రియాంకా ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. లేత వయసులో తెగ అట్రాక్టివ్గా కనిపిస్తోంది మాజీ సుందరి. ఇక ఈ ఫోటోకు భర్త నిక్ జోనస్ స్పందించారు. నిప్పు కణం ఎమోజీ ఆ ఫోటోకు ఆయన ట్యాగ్ చేశారు. నటుడు రణ్వీర్ సింగ్ కూడా కామెంట్ చేశారు. ప్రియాంకా తన ఇన్స్టాలో ఇంకా టీనేజీ ఫోటోలను చాలానే రిలీజ్ చేసింది.