జేవార్: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ఉత్తరప్రదేశ్లోని జేవార్లో నిర్మించనున్నారు. గురువారం ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. 1,330 ఎకరాల్లో నిర్మించనున్న ఈ విమానాశ్రయానికి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా నామకరణం చేయనున్నారు. దీన్ని జ్యూరిచ్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధి చేయనున్నది. 2024లోగా ఎయిర్పోర్టు అందుబాటులోకి రానున్నది.