న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ‘టెస్టు బ్యాటింగ్’ అవార్డును పొందాడు. గతేడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన గబ్బా టెస్టులో పంత్ 89 పరుగులు చేసి భారత్కు చరిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు గాను పంత్కు ఈ అవార్డు లభించింది. ఈఎస్పీఎన్ గురువారం వార్షిక అవార్డులు ప్రకటించింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో జట్టును విజయపథాన నడిపిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్కు ‘కెప్టెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇచ్చింది. టెస్టు బౌలింగ్ పురస్కారం కైల్ జెమిసన్కు లభించగా.. వన్డేల్లో బ్యాటింగ్ అవార్డు ఫకర్ జమాన్ (పాకిస్థాన్), బౌలింగ్లో సకీబ్ మహమూద్ (ఇంగ్లండ్), టీ20 బ్యాటింగ్లో జోస్ బట్లర్ (ఇంగ్లండ్), బౌలింగ్లో షాహీన్ అఫ్రిది (పాకిస్థాన్)కి అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డులను వెటోరి, ఇయాన్ బిషప్, టామ్ మూడీ, అగార్కర్, లిసా స్థాలేకర్, కలినాన్, రస్సెల్ అర్నాల్డ్, డారెన్ గంగా, నఫీజ్, బాజిద్ ఖాన్, మార్క్ నికోలస్తో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది.