న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కేసుల కేటాయింపునకు సంబంధించిన జడ్జిల రోస్టర్లో మార్పులు చేయాలని బార్ అసోసియేషన్, అడ్వొకేట్లు హైకోర్టుల సీజేలపై ఒత్తిడి తీసుకురావద్దని సుప్రీం కోర్టు స్పష్ట చేసింది. రాజస్థాన్ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ రోస్టర్లో మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్ బార్ అసోసియేషన్ బాయ్కాట్కు పిలుపునివ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జడ్జిలపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించింది. జైపూర్ బెంచ్ బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.