న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సదరన్ నేవల్ కమాండ్ను సందర్శించారు. ఆ కమాండ్ కార్యాచరణ ప్రదర్శనను ఆయన పరిశీలించారు. కేరళలోని కొచ్చిలో సదరన్ నేవల్ కమాండ్కు ఆయన వెళ్లారు. నౌకాదళానికి చెందిన నౌకలు, విమానాలు ప్రదర్శించిన పోరాట సామర్థ్యాన్ని వీక్షించారు. సదరన్ నేవల్ కమాండ్ నౌకాదళ పరాక్రమం, కార్యకలాపాల తీరును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందించారు.