ఇటీవల ‘ఎఫ్ఐఆర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ మరో సినిమాను ప్రకటించారు. హీరో రవితేజ సమర్పణలో ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మట్టి కుసీ’్త అనే టైటిల్ను ఖరారు చేశారు. స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి నాయికగా నటిస్తున్నది. బుధవారం నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం వెల్లడించారు. ఈ సినిమాకు ఎడిటర్ : ప్రసన్న జికె, ఆర్ట్ : ఉమేష్, సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్.