బెంగళూరు: భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ బెంగళూరు ఓపెన్-2 టోర్నీ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రజ్నేశ్ 4-6, 2-6తో టాప్సీడ్ అలెగ్జాండర్ వుకిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడాడు. టాప్సీడ్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన ప్రజ్నేశ్ వరుస సెట్లలో నిరాశ పరిచాడు. మరో మ్యాచ్లో భారత ఆటగాడు అర్జున్ 6-4, 6-3తో దిమితర్ కుజ్మనోవ్ (బల్గేరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. ఆరంభం నుంచి చక్కటి సర్వీస్లతో ఆకట్టుకున్న అర్జున్.. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా.. నెట్గేమ్తో ఆకట్టుకుంటూ ముందుకు సాగాడు. అదే జోరులో రెండో సెట్లోనూ దిమితర్ను చిత్తు చేసిన అర్జున్ మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.