ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజేత అంటుంటారు. కానీ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని పరికిస్తే ఎప్పుడూ తగ్గిఉండటాన్నే ఇష్టపడతారాయన. శిఖరాన్ని చేరుకున్నా సరే నేల ఆలంబనను మరచిపోవద్దనే నైజం ప్రభాస్ది. అందుకే ఆయన్ని అభిమానులు డార్లింగ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 2025 వరకు ఆయన సినిమా డైరీ ఖాళీ లేకుండా కనిపిస్తున్నది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం జనవరి 14న విడుదలకానుంది. యూరప్ నేపథ్యంలో నడిచే వింటేజ్ ప్రేమకథ ఇది. ప్రభాస్ తొలిసారి పౌరాణిక కథాంశంతో చేస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో ఆయన శ్రీరాముడిగా కనిపించనున్నారు. ఓంప్రకాష్రౌత్ దర్శకత్వంలో పాన్ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రీకరణ జరుపుకుంటున్నది. యాక్షన్ ప్రధాన చిత్రమిది. వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకురానుంది. ఇక నాగ్అశ్విన్ దర్శకత్వంలో నటించనున్న సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్.కె’ (వర్కింగ్ టైటిల్) చిత్రం త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది. భారీగ్రాఫిక్స్ హంగులతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికాపదుకోన్ నటిస్తున్నది. ఈ సినిమాతో పాటు ఇటీవలే సందీప్రెడ్డి వంగా (‘అర్జున్రెడ్డి’ ఫేమ్) దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ‘స్పిరిట్’ చిత్ర ప్రకటన ఇటీవలే వెలువడింది. ప్రభాస్ నటిస్తున్న 25వ సినిమా ఇది. ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలన్నీ పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటం విశేషంగా చెబుతున్నారు.