హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్లోని బుద్ధవిగ్రహంతోపాటు ట్యాంక్బండ్పై ఉన్న అమరుల విగ్రహాలతో పోస్టల్శాఖ ప్రత్యేక స్టాంపులను బుధవారం విడుదల చేసింది. అబిడ్స్లోని డాక్సదన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ పీవీఎస్రెడ్డి, హెడ్క్వార్టర్స్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ శ్రీలత, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ సంతోష్ తదితరులు స్టాంపులను విడుదల చేశారు. బుద్ధుడు, ముగ్ధుం మొహియొద్దీన్, గుర్రం జాషువా, శ్రీరామదాసు, మొల్ల, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, క్షేత్రయ్య, పోతన విగ్రహాల స్టాంపులు, కార్డులను విడుదల చేసినట్టు పేర్కొన్నారు.