అమీర్పేట్, నవంబర్ 10 : పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ సర్కిల్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ టి.ఎం.శ్రీలత పేర్కొన్నారు. ఫై స్టార్ పోస్టాఫీసుగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఆర్నగర్ పోస్టల్ కార్యాలయంలో స్థానిక అధికారులకు బుధవారం జ్ఞాపిక అందజేసే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్యాంకులకు దీటుగా పోస్టల్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. మంచి ఫలితాలను సాధించిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టాఫీసెస్ (నార్త్) సత్యేంద్ర కృష్ణ, ఎస్ఆర్నగర్ పోస్ట్మాస్టర్ స్వర్ణలత ఫై స్టార్ జ్ఞాపికను పీఎంజీ శ్రీలత చేతుల మీదుగా అందుకున్నారు. అమీర్పేట కార్పొరేటర్ కేతినేని సరళ, సిటీ డివిజన్ ఎస్ఎస్పీఓ నరేశ్, ముజ్తబా హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ మహ్మద్ ముస్తఫా అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.