వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్లోని ఓ పాఠశాలలోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టెక్సాస్ అర్లింగ్టన్లోని ఓ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ.. పాఠశాలలో జరిగిన కాల్పులకు అధికారులు స్పందించారన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలయ్యాయో ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. అధికారులు విచారణ జరుపుతున్నారని పోలీస్ శాఖ ట్విట్టర్లో తెలిపింది. కాల్పుల నేపథ్యంలో పాఠశాలల వెలుపల అంబులెన్స్లు, ఫైరింజన్లను మోహరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.