WEF | దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ నెల 17 నుంచి డబ్ల్యూఈఎఫ్ వర్చువల్ సమ్మిట్ ప్రారంభం కానున్నది. 21వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో, ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తదితరు హాజరు కానున్నారు.
వారం రోజులుగా జరిగే ఈ సదస్సును వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వెబ్సైట్, సోషల్ మీడియా చానెళ్ల ద్వారా వీక్షించవచ్చు. వివిధ దేశాల అధినేతలు, కార్పొరేట్ సంస్థల సీఈవోలు, ఇతర నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమ్మిట్లో చర్చిస్తారు. జీరో ఎమిషన్ విధానాల వేగవంతం, ప్రకృతి సానుకూల సొల్యూషన్స్, గ్లోబల్ వాల్యూ చైన్స్ బలోపేతం, మానవీయ కోణంలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థల నిర్మాణం.. తదుపరి మహమ్మారిలను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ల తయారీలో వ్యత్యాసానికి తెర దించడం తదితర అంశాలపై చర్చిస్తారు.