న్యూఢిల్లీ: హిందూ మహాసముద్ర ద్వీపం సీషెల్స్లో వచ్చే వారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆ పర్యటన వేళ ఆయన అక్కడ నేషనల్ బోటానికల్ గార్డెన్స్ వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన అక్కడ ఓ వృక్షాన్ని నాటనున్నారు. భారత్, సీషెల్స్ మధ్య 50 ఏళ్ల దౌత్య బంధానికి ప్రతీకగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ సంబరాల్లో మోదీ గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఇక ప్రపంచంలో ప్రాణాలతో ఉన్న అతి వృద్ధ జంతువును కూడా ప్రధాని మోదీ కలుసుకోనున్నారు.
1832లో పుట్టిన తాబేలును ఆయన వీక్షించనున్నారు. ఆ తాబేలు పేరు జోనాథన్. ఇప్పుడు అది సుమారు 194 ఏళ్లు ఉంటుందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంచనా వేసింది. సుమారు రెండు శతాబ్ధాలకు చేరుకున్న ఆ జంతువు ఎన్నో చరిత్రాత్మక సందర్భాలకు సాక్షీగా నిలిచింది. వయసు మీరినా ఆ తాబేలు మాత్రం ఆరోగ్యకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెటరర్నీ డాక్టర్లు దాని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. అయితే వయసు రీత్యా ఆ తాబేలుకు కంటి చూపు మందగించింది. వాసన గుర్తుపట్టే గుణాన్ని కూడా కొంత కోల్పోయినట్లు తెలుస్తోంది.